IND vs NZ 2nd ODI : టీమిండియా టాప్ లేపిన కివీస్ బౌలర్లు

Update: 2020-02-08 07:35 GMT

బ్లాక్ క్యాప్స్ నిర్ధేశించిన 274 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. 274 పరుగుల టార్గెట్ తో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా జట్టు వ్యక్తి గత స్కోరు 21 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ (3) ఔట్ అయ్యాడు. అనంతరం మరో ఓపెనర్ పృధ్వీ షా(24) చేసి జెమీసన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(15) శ్రేయస్స్ అయ్యర్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే సౌథీ వేసిన బంతిని అంచన వేయంతో కోహ్లీ విఫలమైయ్యాడు. వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. వెంటనే రాహుల్ కూడా పెవిలియన్ దారి పట్టాడు. దాంతో భారత్ 16 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (26) కేదర్ జాదవ్ (1) తో క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో సౌథీ, బెన్నెట్, గ్రాండ్‌హోం, జెమీసన్‌, తలా ఓ వికెట్ పడగొట్టారు.

  


Tags:    

Similar News