Viral News: గంజాయి మత్తులో వ్యక్తి హల్చల్ – కారును ఆపి, బానెట్పైకి ఎక్కి దాడి యత్నం
మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మూసాపేటలో నడిరోడ్డుపై గంజాయి మత్తులో ఉన్న ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారును అడ్డుకుని దాదాగిరి ప్రదర్శించాడు. కారు బానెట్పైకి ఎక్కి, విండ్షీల్డ్ను పగలగొట్టే ప్రయత్నం చేశాడు.
Viral News: గంజాయి మత్తులో వ్యక్తి హల్చల్ – కారును ఆపి, బానెట్పైకి ఎక్కి దాడి యత్నం
మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మూసాపేటలో నడిరోడ్డుపై గంజాయి మత్తులో ఉన్న ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారును అడ్డుకుని దాదాగిరి ప్రదర్శించాడు. కారు బానెట్పైకి ఎక్కి, విండ్షీల్డ్ను పగలగొట్టే ప్రయత్నం చేశాడు.
కారులోని కుటుంబం భయంతో గజగజలాడింది. స్థానికులు వెంటనే స్పందించి ఆ వ్యక్తిని కారు మీద నుంచి దించారు. ఆ తర్వాత ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనను అక్కడి వారు ఫోన్లో రికార్డ్ చేయడంతో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగినట్లు సమాచారం. గంజాయి మత్తులో ఉన్న వ్యక్తుల దారుణాలకు కఠిన చర్యలు తీసుకోవాలని నగర వాసులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. మద్యమత్తు, డ్రగ్స్ ప్రభావంతో ఇలాంటి దాడులు పెరుగుతుండటంతో, పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.