Viral News: మ‌నిషేనా వీడు.. స‌మాధిలో శ‌వాన్ని బ‌య‌ట‌కు తీసి సెల్ఫీ దిగిన వ్య‌క్తి..!

స‌మాజంలో జ‌రిగే కొన్ని సంఘ‌టన‌లు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తే మ‌రికొన్ని భ‌య‌పెడ‌తాయి.

Update: 2025-05-23 08:14 GMT

Viral: మ‌నిషేనా వీడు.. స‌మాధిలో శ‌వాన్ని బ‌య‌ట‌కు తీసి సెల్ఫీ దిగిన వ్య‌క్తి.

Viral: స‌మాజంలో జ‌రిగే కొన్ని సంఘ‌టన‌లు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తే మ‌రికొన్ని భ‌య‌పెడ‌తాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న అంద‌రినీ ఉలిక్కిప‌డేలా చేసింది. ఓ వ్యక్తి సంవత్సరాల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసి, దానితో సెల్ఫీలు దిగాడు.

ఈ సంఘ‌ట‌న‌తో గ్రామంలో ఉన్న‌వారంతా ఒక్క‌సారిగా కోపంతో ఊగిపోయారు. ఆగ్రహంతో అతడిని చితక్కొట్టారు. పోలీసులు వచ్చి అతడిని రక్షించేందుకు ప్రయత్నించగా వారిపైనా దాడికి దిగారు. ఈ ఘటన తూర్పు మేదినీపూర్ జిల్లా కాంటాయ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇక్కడి స్థానికుడైన ప్రభాకర్ అనే వ్యక్తి, ఓ స్మ‌శానవాటికలోని సమాధిని తవ్వి ఏడేళ్ల క్రితం పూడ్చిన మహిళ మృతదేహాన్ని వెలికితీశాడు. అప్పటికే అది పూర్తిగా అస్థిపంజరంగా మారి ఉంది. ఆ ఎముకలను ఓ చెట్టుకు వేలాడదీయడంతో పాటు, దాంతో సెల్ఫీలు తీసుకుంటూ కనిపించాడు.

ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు తీవ్రంగా స్పందించారు. ప్రభాకర్‌ను పట్టుకుని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని రక్షించేందుకు ప్రయత్నించగా, స్థానికులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి.

దాదాపు రెండు గంటల అనంతరం పరిస్థితి కాస్త నియంత్రణలోకి వచ్చింది. పోలీసులు ప్రభాకర్‌ను ఘటనా స్థలం నుంచి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉంటే ప్ర‌భాక‌ర్ ప‌క్క‌నే మద్యం బాటిల్ కనిపించిన నేపథ్యంలో, ప్రభాకర్‌ మద్యం మత్తులోనే ఈ పనికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం ప్రకారం అతడు ఒక హోటల్‌లో పని చేసేవాడు. అయితే అతడి మద్యం అలవాటు వల్లే ఉద్యోగం కోల్పోయాడని తెలుస్తోంది. అయితే మహిళ మృతదేహాన్ని ఎందుకు తవ్వి బయటకు తీసాడన్న‌ విషయంపై ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదు.

Tags:    

Similar News