A man made his wife wax idol: చనిపోయిన భార్య మైనపు బొమ్మతో గృహప్రవేశం..ఓ భర్త ప్రేమ!

A man made his wife wax idol: భార్య మైనపు విగ్రహం తో గృహప్రవేశం చేరిన భర్త

Update: 2020-08-11 03:04 GMT

అలూమగల మధ్య ఉండే సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వివాహం జరిగిన దగ్గర నుంచి జీవిత ప్రస్థానంలో భార్యా భర్తలుగా వారి సహజీవనం ప్రేమ మయంగా సాగిపోవాలని కోరుకుంటారు. అయితే, ప్రస్తుతం మన సమాజంలో రకరకాల కారణాలతో భార్యలను వేధించేవారు.. పెళ్ళయిన రెండు నెలల్లోనే విడాకుల కోసం కోర్టుకు ఎక్కాలని ప్రయత్నించే వారు.. ఎక్కువగా కనిపిస్తున్నారనేది కఠోర వాస్తవం. అయితే, ఇందుకు భిన్నంగా భార్యను పువ్వుల్లో పెట్టుకుని కాకపోయినా గుండెల్లో పెట్టుకుని ప్రేమించే భర్తలూ చాలా మందే ఉన్నారు. ప్రేమైక జీవితానికి వారే ఉదాహరణలుగా కనిపిస్తారు. అటువంటి వారిలో ఒక అద్భుతమైన ప్రేమ మూర్తి గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం.

లవకుశ సినిమాలో శ్రీరాముడు అశ్వమేధ యాగం కోసం సీతాదేవి స్వర్ణ విగ్రహాన్ని తయారు చేయించి ఆ యాగాన్ని పూర్తి చేసినట్టు చూశాం.. అంతటి ప్రేమను ఇప్పుడు ఓ వ్యక్తి మరణించిన భార్య పట్ల చూపిచడం విశేషం. ఆ వివరాలు..

కర్నాటక రాష్ట్రం.. కొప్పల్ జిల్లలో నివసించే శ్రీనివాస్ గుప్తా తన భార్య పై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తున్న తీరు ఇప్పుడు నేట్టింట్లో సంచలనంగా మారింది. అయన భార్య కొన్నాళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో గుప్తా విపరీతంగా కుంగిపోయారు. తన భార్యను మరచిపోలేకపోయారు. ఆమెను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని గుప్తా సరికొత్తగా ఆలోచించారు. తనను వీడి పోయిన తన సహధర్మచారిణి మైనపు విగ్రహాన్ని తయారుచేయించి ఇంట్లో ఉంచుకున్నారు. తన నూతన గృహ ప్రవేశం సందర్భంగా ఆమె విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేశారు.


నిజంగా అక్కడ ఒక మహిళ కూర్చుని ఉందా అనేంత సహజంగా ఆ విగ్రహం ఉండడం విశేషం. ఏమాత్రం తేడా తెలియని విధంగా ఉన్న ఆ విగ్రహాన్ని చూసి బంధువులంతా ఆశ్చర్యపోయారు. ఇకా గుప్తా కుమార్తెల సంతోషానికి అవధుల్లేవు. ఆ మైనపు బొమ్మలో అమ్మను చూసుకుని మురిసిపోయారు. ఫోటోలు తీసుకుని సంబరపడిపోయారు.

ఏది ఏమైనా శ్రీనివాస్ గుప్తా తన భార్య పట్ల చూపిస్తున్న ప్రేమకు ఇప్పుడు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 



Tags:    

Similar News