జైపూర్‌పై ముంబా విజయం

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌ శనివారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌ని 47-21 తేడాతో యు ముంబా ఏకపక్షంగా ఓడించేసింది.

Update: 2019-09-01 06:46 GMT

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌ శనివారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌ని 47-21 తేడాతో యు ముంబా ఏకపక్షంగా ఓడించేసింది. ముంబా జట్టులో ప్రత్యర్థి కోర్టును షేక్ చేసిన అభిషేక్ 18 సార్లు రైడ్‌కి వెళ్లి 13 పాయింట్లు సాధించగా.. ఫజీల్ అత్రాచెలి ఆరు ట్యాకిల్ పాయింట్లతో సత్తాచాటాడు. దీంతో ముంబా ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన ముంబా.. 6 మ్యాచ్‌ల్లో గెలిచి ఆరింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 32-23తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది.

Tags:    

Similar News