Pro Kabaddi : పవన్ పోరాటంతో సెమీస్‎ చేరిన బెంగళూరు బుల్స్

అహ్మదాబాద్ వేదికగా ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లు ప్రారంభమైయ్యాయి. యూపీ యోధా బెంగుళూరు బుల్స్ మధ్య తొలి ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహించారు.

Update: 2019-10-15 01:14 GMT

అహ్మదాబాద్ వేదికగా ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లు ప్రారంభమైయ్యాయి. యూపీ యోధా బెంగుళూరు బుల్స్ మధ్య తొలి ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యచ్‌లో బెంగళూరు బుల్స్ 48-45 తేడాతో యూపీ యోధాపై విజయాన్ని అందుకుంది. ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో మ్యాచ్ ముగిసేసరికి రెండు జట్లు 36-36తో సమానంగా నిలిచాయి. ఆరు నిమిషాల అదనపు సమయంలో బెంగళూరు విజయాన్ని అందుకుంది.

ఈ మ్యచ్‌లో బెంగళూరు బుల్స్ రైడర్ పవన్ షెరావత్ 20 పాయింట్లు సాధించాడు. అదనపు సమయంలోను వరుస పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బుధవారం జరగనున్న తొలి సెమీఫైనల్ లో బెంగళూరు బుల్స్ దబాంగ్ ఢిల్లీతో తలపడనుంది.

Tags:    

Similar News