ప్రో కబడ్డీ: జైపూర్ జోరు

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 7లో జైపూర్ పింగ్ పాంథర్స్ అదరగొడుతోంది. ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదు గెలుచుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Update: 2019-08-16 04:54 GMT

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 7లో జైపూర్ పింగ్ పాంథర్స్ అదరగొడుతోంది. ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతోంది. అహ్మదాబాద్ లో గురువారం పుణెరి పల్టాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో జైపూర్ చెలరేగిపోయింది. 32-25 తేడాతో జైపూర్ ఘన విజయం సాధించింది. దీంతో జైపూర్ ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదు గెలుచుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక పుణెరి జట్టుకి ఇది ఏడో మ్యాచ్. ఈ ఓటమితో ఆ జట్టుకు ఇది ఐదో ఓటమిగా మిగిలింది.

మ్యాచ్‌లో జైపూర్ స్టార్ రైడర్ దీపక్ హుడా.. 16సార్లు రైడ్‌కి వెళ్లి 9 పాయింట్లు సాధించగా.. డిఫెండర్ విశాల్ (4 పాయింట్లు) అతనికి చక్కటి సహకారం అందించాడు. దీంతో.. హాఫ్ టైమ్ ముగిసే సమయానికి 17-11తో ఆధిక్యంలో జైపూర్ నిలిచింది. తర్వాత పుణెరి పల్టాన్ రైడర్ పంకజ్ మోహితే 8 పాయింట్లతో జట్టుని ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ.. డిఫెండర్ల నుంచి ఆశించినంత సహకారం లభించకపోవడంతో ఆఖర్లో మరింత తడబడిన ఆ జట్టు వరుసగా పాయింట్లు ప్రత్యర్థికి ఇచ్చేసి ఓటమి పాలైంది.


Tags:    

Similar News