ప్రో కబడ్డీ : తలైవాస్ కు బుల్స్ షాక్

రసవత్తరంగా ప్రో కబడ్డీ లీగ్. చివరి వరకూ పోటా పోటీగా సాగిన బెంగాల్-దబంగ్ ధిల్లీ మ్యాచ్. టై గా ముగిసింది. మరోవైపు బెంగళూర్ జట్టు తలివాస్ పై విజయం సాధించింది. ఈరోజు హరియాణా జట్టు తెలుగు టైటాన్స్ తోనూ, తమిళ తలివాస్ పునేరే జట్టుతోనూ తలపడతాయి.

Update: 2019-08-18 03:44 GMT

వరుస ఓటములతో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు బుల్స్ మళ్ళీ విజయాల బాట పట్టింది. మంచి ఫామ్ లో ఉన్న పవన్ కుమార్ షెహ్రావత్ మరోసారి విజృంభించడం తో బెంగళూరు బుల్స్ తలైవాస్ ను చిత్తూ చేసింది. శనివారం జరిగిన ప్రోకబడ్డీ లీగ్ మ్యాచ్ లో బెంగళూరు జట్టు తలైవాస్ పై 32 - 21 తేడాతో గెలిచింది. బుల్స్ రైడర్లకు తలైవాస్ డిఫెండర్లకు మధ్య జరిగిన రసవత్తర పోరులో బుల్స్ రైడర్స్ అనుకున్నది సాధించగలిగారు. పవన్ 10 పాయింట్ల సాధించాడు. రాహుల్ చౌదరి విఫలం కావడంతో తలైవాస్ జట్టు కోలుకోలేకపోయింది. 

ఇక అక్కడే జరిగిన మరో మ్యాచ్ లో దబాంగ్ ఢిల్లీ,  బెంగాల్ వారియర్స్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఇరు జట్లు సమఉజ్జీలుగా నిలవడంతో టై గా ముగిసింది. స్కోరు 30 - 29 గ ఉన్న సమయంలో చివరగా డూ ఆర్ డై రైడ్ కు వెళ్లిన ప్రపంజాన్(10 పాయింట్లు) విఫలం కావడంతో బెంగాల్ డ్రా తో సరిపెట్టుకోకు తప్పలేదు. 




Tags:    

Similar News