ప్రో కబడ్డీ: జైపూర్ జైత్రయాత్ర

Update: 2019-08-17 03:09 GMT

ప్రో కబడ్డీ సీజన్ 7లో జైపూర్ జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో విజయదుందుభి మోగించిన జైపూర్ పింక్ పాంథర్స్ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్ లో జైపూర్ ఆటగాళ్ళు తమ చక్కని ఆటతీరుతో 22 - 19 తేడాతో విజయం సాధించింది.

కాగా, ఇప్పటివరకూ తానాడిన ఏడు మ్యాచుల్లో ఆరిటిని జైపూర్ గెలుచుకుంది. మరోవైపు గుజరాత్ 9 మ్యాచులు ఆడి ఆరిటిలో ఓటమి పాలైంది.

ఇదే వేదికలో జరిగిన మరో మ్యాచ్ లో యూ ముంబా జట్టు పట్నా పైరేట్స్ పై విజయం సాధించింది.


Tags:    

Similar News