ప్రొ కబడ్డీ: సొంతగడ్డపై తమిళ్ తలైవాస్ ఓటమి

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ జట్టు దూమ్మురేపుతోంది. ప్రత్యర్థులను ఆవలీలగా ఓడిస్తూ పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. బుధవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 28-26 తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై గెలిచింది.

Update: 2019-08-22 03:12 GMT

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ జట్టు దూమ్మురేపుతోంది. ప్రత్యర్థులను ఆవలీలగా ఓడిస్తూ పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. బుధవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 28-26 తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై గెలిచింది. ఆట సాగుతున్న సమయంలో నువ్వానేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ పోరులో చివరికి జైపూర్‌నే విజయం వరించింది. ఇటు రాహుల్ చౌదరితో పాటు అజయ్ ఠాకూర్ కూడా నిరాశపరచడంతో తలైవాస్‌కి సొంతగడ్డపై వరుసగా రెండో ఓటమి చూడాల్సివచ్చింది. పాంథర్స్‌ తరఫున రైడింగ్‌లో నీలేశ్‌ సాలుంకే(7), డిఫెన్స్‌లో విశాల్‌(4) రాణించారు. ఇటు తమిళ్ తలైవాస్‌ జట్టులో రాహుల్‌ చౌదరీ(6), వినీత్‌ శర్మ(3) రాణించారు. ఇక మరో మ్యాచ్‌లో పుణేరి పల్టాన్‌ 31-23తో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు బుల్స్‌పై గెలిచింది.  

Tags:    

Similar News