పోరాడి ఓడిన టైటాన్స్

ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7లో తెలుగు టైటాన్స్ చివరి వరకు పోరాడి గెలుపు ముంగిట తడబడింది. బెంగళూరు వేదికగా బెంగళూరు బుల్స్‌ వార్సెస్ తెలుగు టైటాన్స్ శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ హోరాహోరి పోటీని ఇచ్చినా.. 39-40 తేడాతో కొద్దిలో విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది.

Update: 2019-09-07 01:33 GMT

ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7లో తెలుగు టైటాన్స్ చివరి వరకు పోరాడి గెలుపు ముంగిట తడబడింది. బెంగళూరు వేదికగా బెంగళూరు బుల్స్‌ వార్సెస్ తెలుగు టైటాన్స్ శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ హోరాహోరి పోటీని ఇచ్చినా.. 39-40 తేడాతో కొద్దిలో విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. కేవలం ఒక్క పాయింట్ తేడాతో బెంగళూరు బుల్స్‌ చేతిలో ఓడింది. స్టార్ రైడర్ సిద్ధార్థ దేశాయ్ 23 పాయింట్లతో సిద్ధార్థ్ అదరగొట్టినా.. తెలుగు టైటాన్స్‌కి ఓటమి తప్పలేదు. ఒక బెంగళూరు బుల్స్ తరఫున పవన్ షెరావత్ కూడా 23 పాయింట్లు సాధించడం విశేషం. ఇక మరో మ్యాచ్‌లో యూపీ యోధా 41-29తో పాట్నా పైరేట్స్‌పై గెలిచింది. నేటి నుంచి కోల్‌కతా వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. 

Tags:    

Similar News