రాజు గారూ.. బాగున్నారా అంటూ వైసీపీ ఎంపీని ఆప్యాయంగా పలకిరించిన ప్రధాని మోదీ
పార్లమెంట్ సెంట్రల్ హాలు వద్ద నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజును ప్రధాని మోదీ ఆప్యాయంగా పలుకరించారు.
పార్లమెంట్ సెంట్రల్ హాలు వద్ద నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజును ప్రధాని మోదీ ఆప్యాయంగా పలుకరించారు. పార్లమెంట్ సెంట్రల్ హాలు వద్ద మోదీని చూడగానే కృష్ణమరాజు వినయ పూర్వకంగా 'నమస్తే సర్' అంటూ పలకరించారు. బదులుగా మోదీ 'రాజుగారూ బాగున్నారా?' అంటూ సంబోధించి కరచాలనం చేశారు. మోడీ కరచాలనం చేస్తూ రఘురామకృష్ణమరాజు భుజం తట్టారు. రాజ్యసభ నుంచి తన చాంబర్కు వెళుతూ సెంట్రల్ హాల్లో ఆయనతో మోడీ మాట్లాడారు. రఘురామకృష్ణమరాజు పక్కనే ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఇతర ఎంపీలు ఉన్నారు.