West Bengal 7th Phase Elections: బెంగాల్‌ ఏడో దశ పోలింగ్​కు సర్వం సిద్ధం

West Bengal 7th Phase Elections: బెంగాల్ శాసనసభ ఎన్నికల ఏడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.

Update: 2021-04-25 16:07 GMT

బెంగాల్‌ ఏడో దశ పోలింగ్​కు సర్వం సిద్ధం (ఫొటో ట్విట్టర్)

West Bengal 7th Phase Elections: బెంగాల్ శాసనసభ ఎన్నికల ఏడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. సీఎం మమతా బెనర్జీకి సిట్టింగ్​ స్థానమైన భవానీపుర్ సహా 34 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. మొత్తం 284 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ దశ పోలింగ్‌లో అందరి దృష్టి భవానీపుర్​ నియోజకవర్గంపైనే ఉంది.

ఇక గత విడతల పోలింగ్​లో తలెత్తిన ఉద్రిక్తతల దృష్ట్యా.. ఈసారి భద్రతను కట్టుదిట్టం Coronavirusచేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 796 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు చెప్పింది. ఓటర్లు కొవిడ్-19 నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.

Tags:    

Similar News