గవర్నర్‌కు అవమానం.. అసెంబ్లీలోకి రాకుండా గేటుకు తాళాలు

Update: 2019-12-05 08:04 GMT
జగదీప్

పశ్చిమబెంగాల్‌లో గవర్నర్ జగదీప్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య వివాదం తార స్థాయికి చేరింది. ఇవాళ అసెంబ్లీకి వచ్చిన గవర్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీకి వచ్చిన ఆయన కాన్వాయ్ గేట్ నంబర్ వన్ గుండా లోపలకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆ గేటుకు తాళం వేయడంతో ఆయన షాక్‌కు గురయ్యారు. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం గేట్ నంబర్ 2 నుంచి నడుచుకుంటూ లోపలకు వెళ్లారు. దీంతో సీఎం మమత తీరుపై గవర్నర్‌ జగదీప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారంటూ మండిపడ్డారు.

Tags:    

Similar News