పశ్చిమబెంగాల్లో గవర్నర్ జగదీప్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య వివాదం తార స్థాయికి చేరింది. ఇవాళ అసెంబ్లీకి వచ్చిన గవర్నర్కు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీకి వచ్చిన ఆయన కాన్వాయ్ గేట్ నంబర్ వన్ గుండా లోపలకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆ గేటుకు తాళం వేయడంతో ఆయన షాక్కు గురయ్యారు. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం గేట్ నంబర్ 2 నుంచి నడుచుకుంటూ లోపలకు వెళ్లారు. దీంతో సీఎం మమత తీరుపై గవర్నర్ జగదీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారంటూ మండిపడ్డారు.