West Bengal: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం

West Bengal: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం నెలకొంది.

Update: 2021-05-15 07:54 GMT

West Bengal: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం

West Bengal: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం నెలకొంది. మమతా బెనర్జీ తమ్ముడు అషీమ్ బెనర్జీ కరోనాతో మృతిచెందారు. అషీమ్ బెనర్జీకి కొద్ది రోజుల క్రితం కరోనా సోకింది. వెంటనే అతన్ని కోల్‌కతాలోని మెడికా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శనివారం ఉదయం ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే 136 మంది కరోనాతో బలయ్యారు. నిన్న 20వేల 846 కొత్త కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News