Bengal Election 2021: పశ్చిమ బెంగాల్​లో ప్రారంభమైన ఆరో విడత ఎన్నికల పోలింగ్

Bengal Election 2021: బెంగాల్ లో ఆరో విడతలో భాగంగా 43 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్​ జరుగుతోంది.

Update: 2021-04-22 02:21 GMT

West Bengal Assembly Election 2021 Sixth Round

Bengal Assembly Election 2021: వెస్ట్ బెంగాల్ లో 8 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరపాలని ఈసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆరో విడతలో భాగంగా 43 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్​ జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా విస్తరిస్తున్న తరుణంలో ఆరో దఫా ఎన్నికలను కోవిడ్ నిబంధనలతో పకడ్భందీగా నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు.

అధికార టీఎంసీ, బీజేపీ గట్టిగా పోటీపడుతున్నాయి. ఈ రోజు జరిగే ఎన్నికల్లో.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్​ రాయ్​, తృణమూల్​ కాంగ్రెస్​ సీనియర్​ నేతలు జ్యోతిప్రియ మల్లిక్​, చంద్రిమ భట్టాచార్య, సీపీఐ(ఎం) తరఫున తన్మయ్​ భట్టాచార్య ఉన్నారు. వీరితో పాటు టీఎంసీ తరఫున బరిలో ఫిల్మ్ డైరక్టర్ రాజ్​ చక్రవర్తి, నటి కౌషాని ముఖర్జీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కాంగ్రెస్, వామపక్ష కూటమి కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఆరో దశ ఎన్నికల్లో భాగంగా బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని 17 స్థానాలకు, నదియా జిల్లాలోని 9స్థానాలకు, ఉత్తర్​ దినాజ్​పుర్​ జిల్లాలోని 9 స్థానాలకు, పూర్వ బర్ధామన్ జిల్లాలోని 8 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 14,480 పోలింగ్​ కేంద్రాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6:30గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. 1.03 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా.. ఈరోజు జరుగుతున్న 43 సీట్లల్లో 306 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Tags:    

Similar News