'రాజకీయాలకు దూరంగా ఉంటాం': బిపిన్‌ రావత్‌

Update: 2020-01-01 08:29 GMT
బిపిన్‌ రావత్‌

కొత్త త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం సైనిక గౌరవ వందనం స్వీకరించారు. సైనిక దళాల్లో రాజకీయజోక్యం పెరిగిపోతోందన్న ఆరోపణలపై ఈ సందర్భంగా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాము అధికారంలో ఉన్న ప్రభుత్వ ఆదేశాల మేరకే పనిచేస్తామని రాజకీయాలకు దూరంగా ఉంటామని వివరించారు. సైన్యం, నావికాదళం, వైమానిక దళం ఒక జట్టుగా కలిసి పని చేస్తాయని వివరించారు.

Tags:    

Similar News