Sunita Kejriwal: నవభారత నిర్మాణం కోసం భారతీయులను ఆహ్వానిస్తున్నాం

Sunita Kejriwal: ఇండియా కూటమికి అధికారమిస్తే గొప్ప దేశాన్ని నిర్మిస్తాం

Update: 2024-03-31 13:03 GMT

Sunita Kejriwal: నవభారత నిర్మాణం కోసం భారతీయులను ఆహ్వానిస్తున్నాం

Sunita Kejriwal: లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ప్రజలు అవకాశం ఇస్తే గొప్ప దేశాన్ని నిర్మిస్తామని సునీతా కేజ్రీవాల్‌ అన్నారు. మంచి ఆసుపత్రులు, విద్యతో సహా ఆరు హామీలను నెరవేరుస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్, దేశంలో పేదలకు ఉచిత విద్యుత్, ప్రతి గ్రామం, మొహల్లాకు మంచి ప్రభుత్వ పాఠశాల, మొహల్లా క్లినిక్, స్వామినాథన్ కమిటీ నివేదిక ప్రకారం రైతులకు మద్దతు ధర లభిస్తుందని చెప్పారు. తాను ఇవాళ ఓట్లు అడగడం లేదని, నవ భారత నిర్మాణం కోసం 140 కోట్ల మంది భారతీయులను ఆహ్వానిస్తున్నానని ఆమె అన్నారు.

Tags:    

Similar News