Vande Bharat: సికింద్రాబాద్-తిరుపతి రైలు ఇక 20 కోచ్లతో!
రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వందేభారత్ ఎక్స్ప్రెస్కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా కొన్ని రూట్లలో కోచ్ల సంఖ్యను పెంచింది. సికింద్రాబాద్-తిరుపతి సహా ఏడు మార్గాల్లో నడుస్తున్న వందేభారత్ రైళ్లలో ఇకపై మరిన్ని కోచ్లు అందుబాటులో ఉండనున్నాయి.
Vande Bharat: సికింద్రాబాద్-తిరుపతి రైలు ఇక 20 కోచ్లతో!
రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వందేభారత్ ఎక్స్ప్రెస్కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా కొన్ని రూట్లలో కోచ్ల సంఖ్యను పెంచింది. సికింద్రాబాద్-తిరుపతి సహా ఏడు మార్గాల్లో నడుస్తున్న వందేభారత్ రైళ్లలో ఇకపై మరిన్ని కోచ్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఏ రూట్లలో పెరుగుతున్న కోచ్లు?
సికింద్రాబాద్-తిరుపతి
మంగళూరు సెంట్రల్-తిరువనంతపురం
చెన్నై ఎగ్మోర్-తిరునల్వేలి
మదురై-బెంగళూరు కంటోన్మెంట్
దేవ్గఢ్-వారణాసి
హవ్డా-రౌర్కెలా
ఇందౌర్-నాగ్పూర్
ప్రస్తుతం మూడు మార్గాల్లో 16 కోచ్లతో, నాలుగు మార్గాల్లో ఎనిమిది కోచ్లతో వందేభారత్లు నడుస్తున్నాయి. ఇకపై 16 కోచ్ల రైళ్లు 20 కోచ్లకు, 8 కోచ్ల రైళ్లు 16 కోచ్లకు అప్గ్రేడ్ చేయబోతున్నట్టు రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (పీఆర్) దిలీప్ కుమార్ తెలిపారు.
సికింద్రాబాద్-తిరుపతి మార్గం ప్రత్యేకం
సికింద్రాబాద్-తిరుపతి, మంగళూరు సెంట్రల్-తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్-తిరునల్వేలి మార్గాల్లో 16 కోచ్ల వందేభారత్లు ఇప్పటికే నడుస్తుండగా.. వీటిని త్వరలో 20 కోచ్లకు పెంచనున్నారు. మిగతా నాలుగు రూట్లలో 8 కోచ్ల వందేభారత్లు నడుస్తుండగా.. వాటిని 16 కోచ్లకు అప్గ్రేడ్ చేయనున్నారు.
రాబోయే రోజుల్లో కొత్తగా 20 కోచ్ల వందేభారత్లు కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. కొత్త 8, 16 కోచ్ల రైళ్లు మరో కొత్త మార్గాల్లో నడవనున్నాయని కూడా వెల్లడించారు.