ఉత్తరాఖండ్‌ జలప్రళయంలో గల్లంతైనవారు చనిపోయినట్లే

Update: 2021-02-23 16:00 GMT

ఉత్తరాఖండ్‌ జలప్రళయంలో గల్లంతైనవారు చనిపోయినట్లే

ఉత్తరాఖండ్‌ జలప్రళయంలో గల్లంతైనవారంతా చనిపోయినట్లే భావిస్తున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 7న చమోలీ జిల్లాలో సంభవించిన జల ప్రళయంలో మొత్తం 204 మంది గల్లంతయ్యారు. వారిలో 68 మంది మృతదేహాలు మాత్రమే ఇప్పటివరకు లభించాయి. ఈ ప్రమాదంలో ఒక విద్యుత్‌ కేంద్రంతో సహా ఐదు వంతెనలు కొట్టుకుపోయాయి. ప్రమాదం జరిగి రెండు వారాలు గడిచినా మిగిలినవారి జాడ తెలియకపోవడంతో...వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News