14 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన సూపర్ స్టార్

Update: 2019-03-31 14:55 GMT

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గతేడాది రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ బరిలో లేని ఆ పార్టీ ఈసారి జరగనున్న లోక్ సభ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ప్రజాకీయ పార్టీ తరుపున లోక్‌ సభకు పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను ఉపేంద్ర ప్రకటించారు. తొలివిడతలో 14 మంది అభ్యర్థులకు టిక్కెట్లు దక్కాయి. వీరందరికి ఆయన బి ఫారాలు అందజేసినట్టు చెప్పారు. నామినేషన్ కు వెళ్లేముందు వీరందరిని ప్రజలకు పరిచయం చేశారు ఉపేంద్ర. కర్ణాటకలోని 28 లోక్‌ సభ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, ప్రతి అభ్యర్థి సామాన్యుడిలా ఖాకీ చొక్కా ధరించి ప్రచారం చేస్తారని ఉపేంద్ర స్పష్టం చేశారు. పార్టీ కేవలం కరపత్రాలను మాత్రమే సమకూరుస్తుందని.. ఎన్నికల ప్రచార ఖర్చును అభ్యర్థులే పెట్టాలని సూచించారు ఉపేంద్ర. 

Similar News