ద్రవ్యోల్బణం 4 శాతం లోపు ఉంది-నిర్మలా సీతారామన్

Update: 2019-09-14 10:30 GMT

ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, వృద్ధిరేటు కూడా ఆశాజనకంగానే ఉందని ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఎగుమతులపై పన్ను తగ్గింపు గురించి పునరాలోచిస్తామన్నారు. టెక్స్ టైల్స్ ఎగుమతులకు కొత్త పథకం వస్తుందని వివరించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరింత పెరిగే అవకాశముందన్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లో రుణవితరణ పెరుగుతుందని, క్రెడిట్ గ్యారెంటీ స్కీంలతో పరిస్థితులు మెరుగుపడుతాయని భావిస్తున్నట్లు నిర్మాల సీతారామన్ స్పష్టం చేశారు.  

Tags:    

Similar News