Mansukh Mandaviya: క్షయ రహిత భారతదేశం.. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

Mansukh Mandaviya: ఎయిమ్స్ డాక్టర్ల బృందంతో కలిసి కేంద్ర మంత్రి మాండవీయ సైక్లింగ్

Update: 2022-10-04 02:38 GMT

Mansukh Mandaviya: క్షయ రహిత భారతదేశం.. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

Mansukh Mandaviya: క్షయరహిత దేశంగా తీర్చి దిద్దేందుకు వైద్యులు బాధ్యతగా భాగస్వామ్యం కావాలని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మానసుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. ప్రభుత్వ లక్ష్యసాధనకోసం ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల బృందం కార్యపథంపేరుతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. డాక్టర్ల సంకల్పం కార్యరూపం దాల్చాలని ఉత్సాహాన్ని పెంపొందించేందుకు వైద్యుల బృందంతో మంత్రి మాండవీయ ఢిల్లీ రోడ్లపై సైక్లింగ్ చేశారు. దేశనలుమూలలా క్షయమూలాలను పెకలించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతుందన్నారు. 

Tags:    

Similar News