ఢిల్లీలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇవాళ ఉదయం దేశ రాజధానిలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. మృతి చెందిన ఇద్దరు క్రిమినల్స్ రాజా ఖురేషి, రమేష్ బహదూర్లుగా పోలీసులు గుర్తించారు. ఉదయం ఎన్కౌంటర్ చేశారు. ఇద్దరు కూడా పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరు పారిపోతూ పోలీసులపైకి కాల్పులకు పాల్పడ్డారు. దీంతో వారిపై పోలీసులు ఎదురు కాల్పులు జరిపి ఇద్దరిని హతమార్చారు. ఇవాళ ఉదయం 5 నుంచి 5:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మర్డర్ వంటి తీవ్ర నేరాల్లో ప్రమేయమున్నట్లు పోలీసులు తేల్చారు.