Ahmedabad: అహ్మదాబాద్లోని 7 పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్
Ahmedabad: స్కూళ్లలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు
Ahmedabad: గుజరాత్లో రేపు లోక్సభ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. అహ్మదాబాద్లో పలు స్కూళ్లకు బెదిరింపు సందేశాలే వచ్చాయి. నగరంలోని 7 పాఠశాలకు రష్యన్ IP అడ్రస్తో కూడిన సర్వర్ల నుండి ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు వర్గాలు తెలిపాయి. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్తో సహా పోలీసు అధికారుల బృందాలు పాఠశాలల్లో సోదాలు నిర్వహించాయి. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు.