Breaking News: భారీ ఎన్‌కౌంటర్.. 26 మంది మావోయిస్టులు మృతి

Maharashtra: మహారాష్ట్ర గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.

Update: 2021-11-13 14:16 GMT

Maharashtra: భారీ ఎన్‌కౌంటర్.. 26 మంది మావోయిస్టులు మృతి

Maharashtra: మహారాష్ట్ర గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గ్యారపట్టి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. పోలీసులకు, మావోయిస్టులక మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయలైనట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్‌ గోయల్‌ పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. సంఘటనా ప్రాంతంలో కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. ఈ కాల్పులతో సరిహద్దులో భద్రత సిబ్బంది ఒక్కసారిగా అ‍ప్రమత్తమయ్యారు.

Tags:    

Similar News