ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్

Update: 2023-06-02 17:05 GMT

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. బహనాగ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ హౌరా నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Tags:    

Similar News