యూపీలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు దాటుతున్న యాత్రికులను ఢీకొన్న రైలు

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు దాటుతున్న యాత్రికులను రైలు ఢీ కొట్టింది.

Update: 2025-11-05 06:00 GMT

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు దాటుతున్న యాత్రికులను రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మీర్జాపూర్‌లోని చునార్ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చోపన్ - ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ చునార్‌ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ 4 వద్ద వచ్చి ఆగింది.

అందులో నుంచి ప్రయాణికులు దిగి.. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ కాకుండా.. పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న నేతాజీ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రైల్వే పోలీసులు. 

Tags:    

Similar News