Maharashtra: జేసీబీ ఉపయోగించి 27 లక్షలు కొల్లగొట్టిన దొంగ

Maharashtra: మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో ఏటీఎం ధ్వంసం

Update: 2022-04-24 15:00 GMT

మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో ఏటీఎం ధ్వంసం

Maharashtra: అక్రమ కట్టడాలకు వాడుతున్న జేసీబీలను దొంగలు మరో పని కోసం వాడుతున్నారు. ఏటీఎంలలో కరెన్సీ కట్టలు చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలమైన దొంగలు ఈసారి జేసీబీని ఉపయోగించారు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను జేసీబీతో ధ్వంసం చేసి నోట్లు కొల్లగొట్టాడు ఓ దొంగ. ఈ ఘటనలో 27 లక్షలు కొల్లగొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక దొంగ ఆ జేసీబీని కూడా దొంగతనం చేసుకొచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. 

Tags:    

Similar News