జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల అలజడి..దాడి నుంచి తృటిలో తప్పించుకున్న ఆర్మీ జవాన్లు

Update: 2019-09-28 08:52 GMT

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల అలజడి సృష్టించారు. కశ్మీర్‌లో ఒకే రోజు మూడు చోట్ల ఉగ్రదాడులు జరుగుతున్నాయి. శ్రీనగర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై గ్రెనేడ్‌ దాడి జరిగింది. ఆర్మీ జవాన్లు ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇక రాంబన్‌లో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు వారిని బందీలుగా చేసుకున్నారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్రవాదులున్న ఇంటిని చుట్టుముట్టారు. గందర్బల్‌లోని నారంగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Tags:    

Similar News