బ్రేకింగ్: కరోనాతో సీఎం పీఏ మృతి

Update: 2020-06-17 09:04 GMT

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా సీఎంవో కార్యాలయంలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యక్తిగత సహాయకుడు దామోదరన్‌ కరోనా వైరస్‌తో బుధవారం మృతి చెందారు.

సీఎం పళనిస్వామి పీఏగా పనిచేస్తున్న దామోదరన్‌ రెండు రోజుల క్రితమే కొవిడ్‌-19 లక్షణాలతో చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందతూ బుధవారం దామోదరన్‌ మరణించినట్లు అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు.రాష్ట్రంలో ఇప్పటికే కరోనా బారినపడి డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ మృతి చెందిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News