కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Update: 2020-03-13 14:49 GMT

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు హాల్‌లోకి కేవలం లాయర్లు మాత్రమే రావాలని ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలో జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. న్యాయస్థానంలో కేవలం అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తామని కూడా తేల్చిచెప్పారు. విచారణ లో ఆయా కేసులకు సంబంధించిన న్యాయవాదులే హాజరుకావాలని ఇతరులకు ప్రవేశం నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. 

Tags:    

Similar News