Pegasus: ఈ నెల 5న పెగాసస్‌పై సుప్రీం కోర్టు విచారణ

Pegasus: పెగాసస్ వ్యవహారంపై ఈ నెల 5న సుప్రీం కోర్టు విచారించనుంది.

Update: 2021-08-01 11:27 GMT

సుప్రీం కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Pegasus: పెగాసస్ వ్యవహారంపై ఈ నెల 5న సుప్రీం కోర్టు విచారించనుంది. రాజకీయ నేతలు, జర్నలిస్టులతో పాటు అనేక మంది ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తును కోరుతూ సీనియర్‌ జర్నలిస్టులు ఎన్.రామ్, శశి కుమార్ మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం పిటిషన్‌ను విచారించనుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.

Tags:    

Similar News