Supreme Court: ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ పటిషన్ కొట్టివేత
Supreme Court: జైలులో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం
Satyendar Jain: మనీ లాండరింగ్ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సంత్యేందర్ జైన్ రెగ్యులర్ బెయిల్ పిటీషన్ ను సప్రీంకోర్టు కొట్టివేసింది. మధ్యంతర బెయిల్ పై విడుదల అయిన స్యేందర్ జైన్ వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లో లొంగిపోయేందుకు అనుమతించాలంటూ సత్యేందర్ జైన్ తరపు న్యాయవాది అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది. మనీ లాండరింగ్ కేసులో 2022 మే 30న సత్యేందర్ జైన్ అరెస్ట్ అయ్యారు. వైద్య కారణాలతో సత్యేందర్ జైన్ బెయిల్ పై ఉన్నారు. 2023 మే 26న సత్యేందర్ జైన్ కు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు జైన్.