కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేత
హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆపార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రొఫెసర్ సంపత్ సింగ్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆపార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రొఫెసర్ సంపత్ సింగ్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. టిక్కెట్ల కేటాయింపులో తనను పార్టీ తనను పట్టించుకోలేదన్నారు. కుమారి సెల్జా, భూపిందర్ సింగ్, కుల్దీప్ బిషోయ్ మద్దతుదారులకు మాత్రమే పార్టీ సీట్లు కేటాయించిందని ఆరోపించారు. అర్హులైన వారికి టికెట్లు కేటాయించలేదని ఆరోపించారు. ఉక్లానా మండికి చెందిన నరేష్ సెల్వాల్, బార్వాలకు చెందిన రామ్ నివాస్, పార్టీ పక్కన పెట్టిందన్నారు. కార్యకర్తలు, అభిమానులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని సంపత్ సింగ్ తెలిపారు.