ములాయం సింగ్ యాద‌వ్‌కు అస్వ‌స్థ‌త‌.. ఆస్పత్రిలో చేరిక..

Update: 2020-05-08 05:48 GMT

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (80) అస్వస్థతకు గురయ్యారు. కుడుపు నొప్పి కార‌ణంగా తీవ్ర అస్వస్థతకు లోన‌య్యారు. దీంతో వెంట‌నే ఆయ‌న్ని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. 80 ఏళ్ల ములాయం సింగ్ క‌డుపునొప్పి, మూత్ర సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని పార్టీ అధికార ప్ర‌తినిధి రాజేంద్ర చౌద‌రి తెలిపారు. ములాయంకు అన్ని రకాల వైద్యపరీక్షలు చేశామని మేదాంత ఆసుపత్రి డైరెక్టరు డాక్టర్ రాకేష్ కపూర్ చెప్పారు. ములాయం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ రాకేష్ కపూర్ చెప్పారు.

Tags:    

Similar News