వయనాడ్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్సభలో తీవ్ర దుమారం చెలరేగింది. భారత్ అత్యాచారాలకు రాజధానిగా మారిపోతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో దుమారం రేగింది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.