RBI: మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ

RBI: ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్

Update: 2022-02-10 10:14 GMT

RBI: మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ

RBI: ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా కొనసాగించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. కరనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగకపోవడం, అధిక ద్రవ్యోల్బణ భయాల కారణంగా ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపోరేటు 4 శాతంగా ఉంచగా రివర్స్ రెపోరేటును 3.35 శాతంగా కొనసాగిస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణ కోసం ఈసారి కూడా సర్ధుబాటు ధోరణినే కొనసాగించనున్నట్లు తెలిపారు. 

Tags:    

Similar News