'సన్నీ లియోన్‌ అయినా ఇక్కడ నిలువలేరు'

Update: 2019-05-03 05:37 GMT

మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్‌ కుమార్‌ చబ్బేవాల్‌. పంజాబ్ లోని హోషియార్‌పూర్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన పంజాబ్‌లో బీజేపీకి సరైన అభ్యర్ధులు దొరకలేదని విమర్శించారు. పంజాబ్‌లో పొత్తులో భాగంగా మూడు స్ధానాలకు పోటీ చేస్తున్న కాషాయ పార్టీకి అభ్యర్ధులే కనిపించలేదని దాంతో గురుదాస్‌పూర్‌ నుంచి సన్నీ డియోల్‌ను బరిలో దింపారని అన్నారు.

బీజేపీ సన్నీడియోల్‌ను తెచ్చినా, సన్నీ లియోన్‌ను తీసుకువచ్చినా కాంగ్రెస్‌ పెనుతుఫాన్‌ ముందు నిలవలేరని అన్నారు. మోదీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని అన్నారు. కాగా పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికల తుది విడత పోరులో భాగంగా మే 19న పోలింగ్‌ జరగనుంది.

Similar News