దేశవ్యాప్తంగా ముగిసిన రైతుల చక్కా జామ్

*మ.12 గంటల నుంచి 3 గంటల వరకు సాగిన చక్కా జామ్ *ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్‌ మినహా అన్ని రాష్ట్రాల్లో చక్కా జామ్ *హారన్లు, గంటలు మోగించిన అన్నదాతలు, మద్దతుదారులు

Update: 2021-02-06 10:34 GMT

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన చక్కా జామ్‌ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 12 గంటల నుంచి 3 గంటల వరకు రహాదారులు నిర్బంధించి నిరసన తెలిపారు అన్నదాతలు. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్‌ మినహా అన్ని రాష్ట్రాల్లో చక్కా జామ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. హారన్లు, గంటలు మోగించి తమ నిరసన తెలియజేశారు. అదేవిధంగా దేశంలోని ప్రధాన నగరాల్లో రైతులకు మద్దతు తెలియజేశారు విపక్షాలు.

Tags:    

Similar News