అస్సామీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రియాంక గాంధీ ప్రయత్నాలు

Update: 2021-03-02 07:50 GMT

అస్సామీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రియాంక గాంధీ ప్రయత్నాలు

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ గత రెండు రోజులుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రియాంక గాంధీ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కొన్ని చోట్ల ఓటర్లతో కలిసి నృత్యాలు చేశారు. తాజాగా ఇవాళ అస్సామీ ఓటర్లను ఆకర్శించేందుకు ఓ తేయాకు తోటలో ప్రియాంకగాంధీ ప్రత్యక్షమయ్యారు. అక్కడ కూలీలతో క‌లిసి ఆమె తేయాకు సేక‌రించారు.

Full View


Tags:    

Similar News