Narendra Modi: రిషికేష్‌లో 35 ఆక్సిజన్ ప్లాంట్లు ప్రారంభించిన ప్రధాని మోడీ

* పీఎం కేర్స్ కింద 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్లాంట్ల ప్రారంభం

Update: 2021-10-07 11:22 GMT

ప్రధాని నరేంద్ర మోడీ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Narendra Modi - Oxygen Plants: త్వరలోనే భారత్‌లో వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇవాళ రిషికేష్‌లో 35 ప్రెజర్ స్వింగ్ అబ్జార్పాన్ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రధాని జాతికి అంకితం చేశారు. పీఎం కేర్స్ కింద 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్లాంట్లను ప్రారంభించారు. కోవిడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టి భారత్ ప్రపంచానికి ఓ మార్గాన్ని చూపిందన్నారు ప్రధాని. అలాగే, అతితక్కువ సమయంలోనే వైద్య సదుపాయాలు కల్పించి భారత్ తన సామర్ధ్యాన్ని చాటిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

Tags:    

Similar News