దీపావళి ఉత్సవాల్లో పాలుపంచుకోనున్న ప్రధానమంత్రి మోడీ
PM Modi: సాయంసంధ్యవేళలో ప్రత్యేక హారతులతో ఆరాధన
దీపావళి ఉత్సవాల్లో పాలుపంచుకోనున్న ప్రధానమంత్రి మోడీ
PM Modi: దీపావళి ఉత్సవాలకు అయోధ్యపురి ముస్తాబైంది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయోధ్యలో పర్యటించబోతున్నారు. విస్తృత ఏర్పాట్లతో అయోధ్య సర్వాంగసుందరంగా రూపుదిద్దుకుంది. దీపోత్సవాల సందర్భంగా సాయంసంధ్యవేళలో ప్రత్యేక హారతులతో అధిష్టానదేవతను ఆరాధిస్తున్నారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ విభిన్న రీతుల్లో హారతి నివేదనతో ఆరాధనోత్సవాలు ఆధ్యాత్మికశోభను సంతరించుకున్నాయి.