PM Modi: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన మోడీ

PM Modi: కర్నాటక రాష్ట్రం తుముకూరులో పర్యటిస్తున్న ప్రధాని మోడీ

Update: 2023-02-06 11:29 GMT

PM Modi: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన మోడీ 

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ కర్నాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్-HAL ఫ్యాక్టరీని తుముకూరులో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా హాజరయ్యారు. రక్షణరంగంలో అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లను హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో తయారు చేయనున్నారు. భారత దేశ రక్షణావసరాల కోసం వీటిని తయారు చేయనున్నారు. ఇప్పటికై HAL ఫ్యాక్టరీ హైదరాబాద్‌లో ఉంది. అయితే రెండో ఫ్యాక్టరీని కర్నాటకలోని తుముకూరులో ఏర్పాటు చేసింది కేంద్రం. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా సహా ఇతర శత్రుదేశాల నుంచి భారత్‌కు ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో తేలికపాటి హెలికాప్టర్ల అవసరం ఉందని ప్రధాని మోడీ తెలిపారు.

Tags:    

Similar News