లతా మంగేష్కర్‌ను పరామర్శించిన రాష్ట్రపతి

Update: 2019-08-18 14:21 GMT

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పరామర్శించారు. ముంబయిలోని లతా మంగేష్కర్‌ నివాసానికి వెళ్లి, కాసేపు ముచ్చటించారు రాష్ట్రపతి కోవింద్‌. కోవింద్‌ తన ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని లెజెండరీ గాయని లతా మంగేష్కర్‌ ట్వీట్‌ చేశారు. ఆయనతోపాటు కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. 'మన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నన్ను కలవడానికి మా ఇంటికి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. సర్ మీరు మేం గర్వపడేలా చేశారు' అని ట్వీట్‌ చేశారు.


 

Tags:    

Similar News