కరోనా వ్యాక్సిన్‌ : సీఎంల‌తో ప్ర‌ధాని మోడీ కీల‌క స‌మావేశం

Update: 2021-01-08 14:12 GMT

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై సీఎంలతో చర్చించనున్నారు. ఈనెల 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేయనుండగా ఇందుకు సంబంధించి సీఎంలతో చర్చించనున్నారు ప్రధాని. దాంతో పాటు కరోనా వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌ లాంటి పలు విషయాలపై ఆరా తీయనున్నారు. క‌రోనా వైర‌స్ ను ఎదుర్కొనే విష‌యంలో లాక్ డౌన్ స‌మ‌యంలో ప‌లుసార్లు సీఎంల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా భేటీ అయిన ప్ర‌ధాని, ఇప్పుడు వ్యాక్సిన్ వ‌చ్చిన త‌రుణంలో మ‌రోసారి భేటీ కాబోతున్నారు.

Tags:    

Similar News