లాక్ డౌన్ లో నెలకొన్న పరిస్థితులు, కరోనా వైరస్ వ్యాప్తి తదితర అంశాలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మొదలైంది. కొవిడ్ - లాక్డౌన్ నేపథ్యంలో ఇటీవల కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయాలను హోం మంత్రి అమిత్ షా సీఎంలకు వివరిస్తున్నారు.
కోవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం రెడ్ జోన్లుగా ఉన్న వాటిని ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మార్చడానికి అవసరమైన చర్యలతోపాటు, లాక్ డౌన్ అనంతరం ఆర్థిక కార్యకలాపాలకు ఎలా ఊతమివ్వాలనే విషయంపై కూడా ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. లాక్డౌన్ -3 మరో ఆరు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో సీఎంలతో భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. లాక్డౌన్ కొనసాగిస్తారా లేక ముగిస్తారా అని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు.