ఉగాది సందర్భంగా ప్రధాని మోదీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలను తెలుగులో తెలపడం విశేషం. ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది... ఈ ఏడాది ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతన శక్తిని ప్రసాదిస్తుందని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో.. ముఖ్యంగా ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థించారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. అదే విధంగా వివిధ భాషల్లో ప్రజలకు ట్విటర్ వేదికగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది.
— Narendra Modi (@narendramodi) March 25, 2020
ఈ సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతనశక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను.
ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ముఖ్యంగా ఆరోగ్యంతో వుండాలని ప్రార్ధిస్తున్నాను.