PM Modi: 40 జిల్లాల కలెక్టర్లతో ప్రధాని వర్చువల్ భేటీ

PM Modi: వ్యాక్సినేషన్‌లో వెనుకపడి ఉన్న 40 జిల్లాలు

Update: 2021-11-03 10:38 GMT

వాక్సినేషన్ లో వెనుకబడిన జిల్లాల కలెక్టర్లతో మోడీ వర్చువల్ మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

PM Modi: ఇటలీ, యూకే పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ వ్యాక్సినేషన్‌పై జిల్లాల మెజిస్ట్రేట్‌లతో సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 40 జిల్లాలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వెనుకపడి ఉన్నాయి. ఈ 40 జిల్లాల్లో ఫస్ట్ డోస్ తీసుకున్న వారి సంఖ్య 50శాతం కూడా లేదు. దాంతో ఆ జిల్లాల కలెక్టర్లతో వర్చువల్‌గా ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ మరింత ఉధృతం చేయాలన్నారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 10.34 కోట్ల మంది గడువు ముగిసినా సెకండ్ డోస్ తీసుకోలేదని ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి చేసిన ప్రకటన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.

Tags:    

Similar News