PM Modi: ప్రపంచ వ్యాప్తంగా అస్థిరత రాజ్యమేలుతోంది
PM Modi: దేశం ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తోంది
PM Modi: తమ హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, అది కొందరిని బాధిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. దేశ ప్రగతిని చూసి బాధపడేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ ప్రతిపక్షాలనుద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని... రాష్ట్రపతి ప్రసంగానికి హాజరుకాకుండా అవమానించి వారు కూడా ప్రసంగించారని విమర్శించారు. అయితే ఆ ప్రసంగంతో వారిలోని సమర్థత, విద్వేషం బయటపడిందని ఎద్దేవా చేశారు. గత 9 ఏళ్లుగా విపక్ష నేతలు ఆలోచన లేకుండా ఆరోపణలే చేస్తున్నారని మోడీ దుయ్యబట్టారు. విపక్ష నేతలు ఏకమవుతున్నది దేశం కోసం కాదని.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వల్లే ఒక్కటవుతున్నారని... విపక్షాలను ఈడీ ఏకం చేస్తోందని ప్రధాని విమర్శించారు.